కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మొత్తం సినిమా థియేటర్లను బంద్ చేశారు. ఈ స్థాయిలో థియేటర్లను బంద్ చేయడం గతంలో ఎప్పుడు జరిగి ఉండదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ కారణంగా బుల్లి తెరకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఓటీటీలతో పాటు శాటిలైట్ ఛానెల్స్ కూడా భారీగా టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.
ఉగాది సందర్బంగా జెమిని టీవీలో ప్రసారం అయిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగే చిత్రం కూడా భారీగా టీఆర్పీ రేటింగ్ను దక్కించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మొన్న వారం ప్రసారం అయిన సుమ ‘క్యాష్’ పోగ్రాం కూడా దుమ్ము రేగిపోయేలా టీఆర్పీ రేటింగ్ను దక్కించుకుంది. ఇంకా ప్రముఖ షోలు ఇంకా సీరియల్స్ కూడా రేటింగ్ విషయంలో గతంలో ఎప్పుడు చూడని సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
ఇంటి వద్దనే ఉండటంతో పాటు పూర్తిగా టీవీకే పరిమితం అవ్వడం వల్ల కార్యక్రమాల టీఆర్పీ రేటింగ్ దాదాపు అన్ని ప్రముఖ షోలకు కూడా విపరీతంగా వచ్చింది. ఇక చాలా కాలం నాటి రామాయణంను తాజాగా దూరదర్శిణిలో వేయగా ప్రేక్షకు దాన్ని కూడా వదల్లేదు. దేశ వ్యాప్తంగా రెండు ఎపిసోడ్స్కే ఏకంగా 8.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయట. మొత్తానికి బుల్లి తెరకు ఈ మూడు వారాల పాటు పంట పండినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
832464 876814I like this weblog so much, saved to my bookmarks . 850773
647370 536204Spot up for this write-up, I really believe this internet site requirements an excellent deal much more consideration. Ill likely to end up once more to read a great deal a lot more, numerous thanks for that data. 805387