ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులను సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ( డీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆటిజం, మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు విద్యా బోధన చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో ప్రభుత్వం వివరించింది. అత్యధికంగా గుంటూరులో ఎస్జిటి పోస్టులు 151 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. స్కూల్ అసిస్టెంట్ల విషయానికొస్తే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 226 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.