కాబోయే వాడిని అత్తకే అమ్మేసింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

శుభలగ్నం సినిమా గుర్తుందా? అందులో ఆమని తన భర్తను రూ.కోటికి రోజాకి అమ్మేస్తుంది. మొగుడి చాలీచాలని సంపాదనతో పడుతున్న కష్టాలు పోగొట్టుకోవడం కోసం తన మంగళసూత్రాన్ని అంగడి సరుకుగా మార్చేస్తుంది. తర్వాత ఎదురయ్యే కష్టాలు అవీ.. అదంతా వేరే సంగతి. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ చిన్న మార్పు ఏమిటంటే.. పెళ్లి కాకుండానే ఆమె తన కాబోయే భర్తను అమ్మేసింది. అది కూడా ఎవరికో తెలుసా? తనకు కాబోయి మిస్సయిపోయిన అత్తకి.

అమెరికాకి చెందిన ఓ యువతి కాలేజీ రోజుల నుంచి తన సహ విద్యార్థితో ప్రేమలో పడింది. కొంతకాలం సహజీవనం కూడా చేసింది. ఈ క్రమంలో ఇరువురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. షరా మామూలుగానే అక్కడ కూడా వీరి పెళ్లికి అబ్బాయి తరఫు పెద్దలు అభ్యంతరం చెప్పారు. అయినా కూడా వారిని ఒప్పించి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. అప్పటివరకు బాగానే ఉన్న వీరిద్దరి మధ్యా చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పి వెళ్లాల్సిందేనని అబ్బాయి.. నువ్వు పార్టీలు, పబ్బులంటూ వెళ్లి పీకలదాకా తాగావో ఊరుకునేది లేదని అమ్మాయి.. తగవులాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో అబ్బాయి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ యువతి.. ఇక అతడికి బ్రేకప్ చెప్పేయాలని డిసైడ్ అయింది.

ఇక ఈ విషయం ప్రియుడికి చెబుదాం అనుకునే సమయంలో ఆమెకు కాబోయే అత్త నుంచి ఫోన్ వచ్చింది. తన కొడుకుని వదిలేస్తే 10వేల డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. బ్రేకప్ చెప్పేద్దామని డిసైడ్ అయిన సమయంలో భలే మంచి ఆఫర్ వచ్చిందని ఆ యువతి సంబరపడింది. వెంటనే కాబోయే అత్త ఇచ్చిన ఆఫర్ కు ఓకే చెప్పింది. ఆమె నుంచి 10వేల డాలర్లు (దాదాపు రూ.7 లక్షలు) అందుకున్న వెంటనే కాబోయే మొగుడికి గుడ్ బై చెప్పేసింది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘మేం ఇద్దరం చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నాం. కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాం. ఇటీవలే మాకు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే, అతడి తల్లిదండ్రులకు నేనంటే అస్సలు ఇష్టంలేదు. తన కుమారుడిని వదిలేయాలంటూ చాలాసార్లు చెప్పారు. కానీ నేను పట్టించుకోలేదు. అయితే, ఎంగేజ్ మెంట్ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రతిదానికీ ఆరా తీయడం మొదలుపెట్టాడు. నాపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నించాడు. నేను ఎక్కడకు వెళ్లాలన్నా చెప్పి వెళ్లాలని, రోజులో ఎక్కడ ఎంత సేపు ఉన్నానో ప్రతి విషయం తనకు తెలియాలని ఆర్డర్ వేశాడు. ఇది నాకు నచ్చలేదు. పైగా అతడు పెద్ద తాగుబోతుగా మారిపోయాడు. ఇలాంటి వాడితో నా జీవితం హ్యాపీగా ఉండదని భావించి, బ్రేకప్ చెబుదామని నిర్ణయించుకున్నాను. ఈలోగా అతడి అమ్మ నుంచి నాకు ఫోన్ వచ్చింది. తన కొడుకుని పెళ్లి చేసుకోకుండా వదిలేసి వెళ్లిపోతే 10వేల డాలర్లు ఇస్తానని చెప్పింది. ఇది బాగానే ఉందని భావించి అందుకు అంగీకరించాను. అయితే, ఈ విషయం తన కొడుకుని తెలియకూడదని ఆమె షరతు విధించింది. అందుకే అతడికి అసలు విషయం చెప్పకుండా బ్రేకప్ చెప్పి వచ్చేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అని వివరించింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమ్మాయికి మద్దతు పలుకుతుండగా.. ప్రేమను మోసం చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ విషయం వైరల్ గా మారింది.

6 COMMENTS

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కన్యకు పనుల్లో పురోగతి.. ధనుస్సుకు శుభవార్తలు

జూన్ 12 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా రాశిఫలాలు మీ కోసం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్య విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

రాజకీయ హింసకు గురైన కుటుంబాలకు అండగా నిలిచే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో నిలిచింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బీసీ...

19 న తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం: మరింత బలపడుతున్న జనసేన!

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలపై గత కొద్ది రోజులుగా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కార్యక్రమాలపై విమర్శలు, కొన్ని కార్యక్రమాలకు అనుమతుల అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, జనసేనకు ఊహించని...

పరామర్శకు వెళ్లిన లోకేష్.. ఆస్పత్రి వద్ద రాజకీయ వివాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు ప్రస్తుతం...