తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాను.. ఇక్కడ నుండి కేసీఆర్ నెత్తిన కాలు పెట్టి తొక్కేస్తాను అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నాడు. గజ్వేల్ లో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. కేసీఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ మీటింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని.. విఫలం చేసిందుకు ప్రయత్నించిందని ఆరోపనలు వినిపించాయి. ఎన్ని జరిగినా కూడా భారీ ఎత్తున గజ్వేల్ లో రేవంత్ రెడ్డి సభకు జనాలు హాజరు అయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ శాఖ నాయకులు మరియు కార్యకర్తలను అరెస్టులు చేశారని.. ఎక్కడ నుండి కూడా జనాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఎన్ని జరిగినా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ సభ ఘన విజయం సాధించింది. ఈ సభ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి సభకు ఇసుక వేస్తే రాలనంత మంది రావడం ఆనందంగా ఉందంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
911561 997867Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your weblog you may be interested in hearing. Either way, excellent website and I look forward to seeing it expand more than time. 911477