తను పెంచుకునే ఆవుల పేడ దొంగతనానికి గురైందంటూ ఓ రైతు పోలిస్ కేసు పెట్టాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కోబ్రా జిల్లాలోని ధూరెనా గ్రామంలో జరిగిందీ సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఆవు పేడను కొంటామని ఇటివల ప్రకటించింది. ఇందుకు కిలోకు రెండు రూపాయలు చెల్లిస్తామని కూడా తెలిపింది. దీంతో గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఆవులను కలిగివున్న రైతులు పేడను పోగు చేసి అమ్ముతున్నారు.
ఈక్రమంలో ధూరేనా గ్రామానికి చెందిన ఓ రైతు ఏకంగా 800 కిలోల ఆవు పేడను సేకరించి పిడకలుగా మార్చి కుప్పగా పోశాడు. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు 800 కిలోల పిడకలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు జూన్ 15న దిప్కా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 1600 రూపాయల విలువైన ఆవు పిడకలను ఎత్తుకెళ్లిన వాళ్లని పట్టుకోవాలని.. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.
954745 473137Some truly good stuff on this site , I like it. 419879