ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడం.. ఇవన్నీ ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యాలు.
కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది. కానీ, మృతదేహాల తరలింపు విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. ఇంకోపక్క, ఈ ప్రమాదంపై చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లోకో పైలట్స్ తప్పు లేదు.. కేవలం సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య.. అని అంటున్నారు రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే శాఖ మంత్రి కూడా.! సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య అంటే చిన్న విషయం కాదు. కింది స్థాయి రైల్వే అధికారులపై చర్యలు తీసుకుంటే సరిపోదు.
మొత్తంగా 300 మంది ప్రయాణీకుల ప్రాణాలు పట్టాల మీద నలిగిపోయాయ్.! భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర దుర్ఘటనల్లో ఇది కూడా ఒకటి. ఇందులో ఉగ్ర కుట్ర లాంటిది ఏమైనా వుందా.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి.
ఇదంతా ఓ యెత్తు.. అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యత కేంద్రం తీసుకుంటుందా.? తీసుకుని తీరాల్సిందే. ఎన్నికల ప్రచార సభల్లో, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ప్రధాని మోడీ రాజకీయ విమర్శలు చేస్తుంటారు.
మరిప్పుడు.. జరిగిన ఘోరం.. చాలా చాలా పెద్దది. ప్రధాని నైతిక బాధ్యత వహించాల్సిందే కదా.?