Switch to English

13 ఇళ్లున్న గ్రామానికి.. రూ. 2 కోట్లతో రోడ్డు సదుపాయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువగా డోలీలపై ఆధారపడాల్సిన పరిస్థితిని చాలా దగ్గర చూస్తుంటాం. అయితే అక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం ఆ ఊరి ప్రజల వెతలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అసలు రోడ్డు సదుపాయమేలేని ఆ ఊరికి రూ. 2 కోట్లతో రహదారి వేయించింది.

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధిలోని బింగిడి వలస గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేదు. అత్యవసర సమయాల్లో వారికి డోలీలే శరణ్యం. అయితే గత టీడీపీ ప్రభుత్వం 400 మీటర్ల మేర మట్టి రోడ్డు వేసి నిధుల సమస్య వల్ల వదిలేసింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో పలుమార్లు రోడ్డు సదుపాయం గురించి మొరపెట్టుకున్న ఫలితం లేదు.

బింగిడి వలస గ్రామ ప్రజల కష్టాలని గుర్తించిన కూటమి ప్రభుత్వం దిగువమెంగిడి – బూర్జ ప్రధాన రహదారి నుంచి శిఖరాగ్రం లో ఉన్న బింగిడి వలస గ్రామానికి 1.4 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు వేయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. రెండు కోట్ల నిధులు కేటాయించింది.

ఇటీవలే రోడ్డు పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. బింగిడివలస లాగే శిఖరాగ్రం లో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇంతకీ ఆ ఊరిలో ఉన్న ఇళ్లెన్నో తెలుసా.. అక్షరాల 13. జనాభా కేవలం 55 మంది మాత్రమే.

సినిమా

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఒక సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. సూర్య రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా జూన్...

Farmer: రైతు ఆవేదన.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. కేంద్ర మంత్రి స్పందన

Farmer: దుక్కి దున్ని, ఆరుగాలం కష్టించే రైతుకే తెలుసు పంట విలువ. రేటు రాకపోయినా తర్వాతి పంట పండించేందుకు సిద్ధమయ్యే నిజమైన అన్నదాత. అటువంటి రైతుకే కష్టం వస్తే సమాజానికి మంచిది కాదు....

రేషన్ వాహనాల రద్దు: ఎందుకు మంచి నిర్ణయమంటే.!

జూన్ 1 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ వాహనాల్ని రద్దు చేస్తూ, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో, ఇంటి వద్దకే రేషన్ సరుకుల్ని అందించేందుకుగాను ఈ రేషన్ వాహనాల్ని...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...