06.25 P.M: ఫొటోటాక్ : కూతురు హోదా చూసి తండ్రి కళ్లలో ఆనందం
కని పెంచిన కొడుకు లేదా కూతురు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందంకు అవధులు ఉండవు. కూతురు విజయంను చూస్తూ ఒక తండ్రి ఆనందిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మణిపూర్ పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసు అధికారికగా బాధ్యతలు చేపట్టింది రతన్ గ్నసెప్పం. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న రతన్ ఇటీవలే డ్యూటీలో జాయిన్ అయ్యింది.
యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్తున్న కూతురుకు ఉన్న స్టార్స్ను తండ్రి ఆసక్తిగా చూస్తు ఉండగా, అమిత్ పంచాల్ అనే జర్నలిస్ట్ ఈ ఫొటోను తీశాడు. తన విజయం తాలూకు ఆనందంను తండ్రి కళ్లలో చూసిన రతన్ గ్నస్పెం ఆనందానికి అవధులు లేవు. తన కూతురు ఆ హోదాలో చూసిన ఆ తండ్రి ఆనందం కూడా అంతా ఇంతా కాదు. తండ్రి కూతుళ్ల ఆనందదాయక ఈ ఫొటోకు వేలల్లో లైక్స్ వందల్లో కామెంట్స్ వస్తున్నాయి.
06.00 P.M: సిర్పూర్లో మరో గ్యాస్ లీకేజ్ – 20మందికి అస్వస్థత
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.. అదే రోజు దేశంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజుకొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం పేపర్ ఇండస్ట్రీలో మరో ప్రమాదం జరిగింది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పేపర్ 1, 2 ఫ్లాంట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు.
ముఖ్యంగా బాయిలర్కు దగ్గర్లోని క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఒకర్ని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కార్మికుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందట. అలాగే మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు.
లాక్ డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో బాయిలర్స్ ఉపయోగించడం లేదు, దాని వల్ల పేపర్ బ్రైట్ నెస్ పెంచడం కోసం ఉపయోగించిన క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడం వలనే ఈ ఘటన జరిగుంటదని సమాచారం. ఈ విషయంపై మాట్లాడటానికి జేకే పేపర్ మిల్ యాజమాన్యం మాట్లాడటానికి నిరాకరించడమే కాకుండా కార్మికులను అర్థాంతరంగా ఇంటికి పంపేసింది.
05.30P.M: హతవిధి టీటీడీకి ఎంతటి కష్టమొచ్చింది
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంకు అత్యంత ప్రాచుర్యం ఉంది. ప్రపంచ దేశాల నుండి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. రోజుకు రెండు కోట్లకు తగ్గకుండా హుండీ ఆదాయం, విరాళాలు ఇంకా ఇతరత్ర రూపాల ద్వారా డబ్బు వచ్చేది. కాని ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆదాయం జీరోకు పడిపోయింది. రూము కిరాయిల నుండి హుండీ ఆదాయం వరకు అంతా జీరో అవ్వడంతో టీటీడీ ఇప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.
గత నెలలో ఏదోలా జీతాలు ఇచ్చిన టీటీడీ ఇప్పుడు మాత్రం తమ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కిందా మీద పడుతోంది. వేల కోట్ల టీటీడీ ఆస్తులు ఉన్నా వాటిని ముట్టుకోకూడదు అనే ఉద్దేశ్యంతో అధికారులు ఉద్యోగులకు జీతాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తిరుమల శ్రీవారి దేవస్థానం చేరుకోవడం అత్యంత బాధకరం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేవస్థానంగా పేరు గాంచిన తిరుమలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర చిన్న చిన్న ఆలయాల్లో కనీసం అర్చకుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. కరోనా మహమ్మారి వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలను అతలా కుతలం చేస్తుంది అనేందుకు ఇదే సజీవ సాక్ష్యం.
799858 452812Wohh exactly what I was searching for, regards for posting . 33250
730925 806120I come across your webpage from cuil and its high quality. Thnkx for giving this sort of an incredible post.. 313066
837678 803829Terrific work! That is the kind of information that are meant to be shared across the internet. 475047
381315 332070Not long noticed concerning your web web site and are nonetheless already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice blog. ill be bookmarking keep visiting this web website actually usually. 816451