తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో అన్ని గుడిసెలకు నిప్పంటుకుంది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి దాదాపు ఆ పది గుడిసెలు తగలబడిపోయాయి. మొత్తానికి ఫైర్ టీం వారు మూడు ఫెయిర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పి, పక్క ప్రాంతానికి, ఇళ్ళకి అంటుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఒక మహిళకి తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు ఫైర్ అధికారులకి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
#Telangana, సికింద్రాబాద్, బాపూజీ నగర్ లో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న 10 కూలీల గుడిసెలు కాలిపోయాయి. ఈ విషయం తెలియగానే ఫైర్ టీం మూడు ఫైర్ ఇంజన్స్ తో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఒక మహిళకి, ఇద్దరు ఫైర్ అధికారులకి గాయాలయ్యాయి. #FireAccident #Hyderabad #KTR pic.twitter.com/646TDo57ZQ
— TeluguBulletin.com (@TeluguBulletin) May 29, 2020
294010 439852Its amazing as your other weblog posts : D, thanks for posting . 107379