తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ తెల్లవారుఝాము 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సచివాలయ భవనంలోని మొదటి అంతస్థులో ప్రమాదం జరిగింది. దీంతో భవనంపైన ఉన్న గుమ్మటంపై భారీగా పొగలు అలముకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సచివాలయంలో వుడ్ వర్క్స్ జరుగుతున్నాయని.. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సచివాలయం ప్రారంభించేందుకు నిర్ణయించారు. భవనంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేశారు. ప్రజా గాయకుడు గద్దర్ సూచన మేరకు సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా సీఎం కేసీఆర్ పేరు పెట్టారు.
414517 23944You produced some decent points there. I looked on the net to the issue and found a lot of people go together with together along with your internet internet site. 992977
169016 696675An really interesting read, I may possibly possibly not agree completely, but you do make some very valid points. 6257