Switch to English

ఐదేళ్ల తర్వాత జనంతో ప్రయాణించిన జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

వైఎస్ఆర్సిపి అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా జనంతో ప్రయాణించారు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన జనంలో తిరిగింది లేదు. సీఎం అయిన తర్వాత ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అధికారిక పర్యటన అయినా, వ్యక్తిగత కార్యక్రమమైనా పటిష్ట బందోబస్తుతో తిరిగేవారు. ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా జనాల్లోకి వచ్చి మాట్లాడింది లేదు.

సాక్షాత్తు సీఎం అయ్యుండి పరధాలు కట్టుకొని తిరుగుతున్నారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. అయితే గురువారం ఆయన సామాన్య ప్రజలతో కలిసి విమానంలో ప్రయాణించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల బెంగళూరు వెళ్ళిన జగన్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరు నుంచి గన్నవరం కి ఇండిగో విమానంలో తన భార్య భారతి తో కలిసి ప్రయాణించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు.

ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ రెండోసారి బెంగళూరుకు వెళ్లారు. ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

అయితే, వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య సంచలనం రేపడంతో జగన్ మధ్యలోనే తన పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చారు. ఈ హత్య ఏపీలో పొలిటికల్ వార్ కి తెరతీసింది. రషీద్ ని చంపిన జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు రషీద్ హత్య కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సినిమా

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా...

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

రాజకీయం

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

ఎక్కువ చదివినవి

సంక్షోభమే అవకాశం.! అదే విజనరీ చంద్రబాబు ఘనత.!

సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమే విజనరీ.! ఔను, ఆ విజనరీ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రతిసారీ చంద్రబాబు చెప్పే మాట ఇదే.. సంక్షోభంలోంచి అవకాశాలు వెతుక్కోమని. నేటి...

అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా విషెస్ తెలిపారు. 'అనితర సాధ్యుడు...

మీ లాంటి నాయకుడు దొరకడం తెలుగువారి అదృష్టం.. చంద్రబాబుకు చిరంజీవి విషెస్..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. 'కృషి, పట్టుదల, అంకిత భావం...

అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు నమోదు చేయాలి.. స్టూడెంట్స్ యూనియన్ల డిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని సంస్థలు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల...