గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విడుదలైన తొలి రోజే మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్తో కలిసి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వి. మునిరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా, ఫ్యామిలీ ఆడియెన్స్ను ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది.
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ, సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తోందని, చాలా చోట్ల హౌస్ ఫుల్ షోలు నమోదవుతున్నాయని తెలిపారు. డైరెక్టర్ వి. మునిరాజు మాట్లాడుతూ, బీ, సీ సెంటర్లతో పాటు విదేశాల్లోనూ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోందని, ప్రేక్షకులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ, కొత్త టీమ్ చేసిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి కూడా సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “మా సినిమాకు మీడియా, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసి కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి. కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్లి ఈ సినిమాను తప్పక చూడండి” అని కోరారు.
సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వంశీకాంత్ రేఖన సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్తో ముందుకు సాగుతోంది.
