బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వంకు మరియు ఆయన తీసుకు వచ్చిన చట్టాలకు మద్దతు పలికింది. కంగనా పలు సందర్బాల్లో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడింది. దాంతో ఆమెను ఇప్పటికే చంపేస్తామంటూ బెదిరింపులకు రైతులు పాల్పడ్డారు. ఆమె వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడంతో అంతా సర్థుమనిగింది. ఈ సమయంలో కంగనా పంజాబ్ కు వెళ్లగా అక్కడ ఆమెకు షాక్ తగిలింది.
అనూహ్యంగా ఆమెను అక్కడి రైతులు అడ్డగించారు. ఆమె ప్రయానిస్తున్న కారును ఆపి రైతులపై చేసిన వ్యాఖ్యలకు ఓమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. లేదంటే అక్కడ నుండి కదలనిచ్చేది లేదు అంటూ వారు డిమాండ్ చేశారట. దాంతో ఆమె భయాందోళనకు గురైంది. కొద్ది సేప గలాటా తర్వాత అక్కడకు పోలీసులు వచ్చి ఆమెను అక్కడ నుండి పంపించారు. అక్కడి వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై తాను ఫిర్యాదు చేస్తానంటూ కూడా పేర్కొంది.
936998 240524Thank you for sharing with us, I think this internet site truly stands out : D. 301919
999755 126692Nice read, I just passed this onto a colleague who was doing a bit research on that. And he just bought me lunch since I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 914552