Switch to English

ఎక్స్‌ క్లూజివ్ ఇంటర్వ్యూ: ప్రశాంత్ వర్మ – నేను రాసే ప్రతి కథలో మహేష్ బాబు, నానిలే హీరోలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘అ!’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసల దక్కించుకున్న ప్రశాంత్‌ వర్మ ఆ తర్వాత కల్కి సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ ఏం చేస్తున్నాడు ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటీ అనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

మీ ప్రస్తుత సినిమా వైరస్‌ గురించి కదా, ప్లానింగ్‌ ఏంటీ?

ఔను ప్రస్తుతం నేను వైరస్‌ గురించే సినిమా తీస్తున్నాను. ఇలాంటి జోనర్‌లో తెలుగులో ఇప్పటి వరకు ఎవరు కూడా తీయలేదు. అందుకే చాలా ఇంట్రెస్ట్‌గా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. వచ్చే వారంలో మోషన్‌ పోస్టర్‌ విడుదల చేస్తున్నా. సినిమా స్టోరీ మరియు ఇతర విషయాలను త్వరలో రివీల్‌ చేస్తానంటూ ప్రకటించాడు.

మీ తదుపరి చిత్రం అఖిల్‌తో ఉండాలి కదా, ఎందుకు ఆ సినిమా చేయడం లేదు?

అఖిల్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా గత ఏడాది డిసెంబర్‌ లో పూర్తి అవ్వాల్సి ఉంది. అది పూర్తి అయిన వెంటనే నేను మొదలు పెట్టానుకున్నాను. కాని అఖిల్‌ మూవీ ఆలస్యం అవ్వడంతో నేను మరో సినిమాను మొదలు పెట్టాను.

ఈ లాక్‌డౌన్‌లో కూడా షూటింగ్‌ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది?

ఇది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే రోజంతా కూడా మాస్క్‌ పెట్టుకుని ఉండాలి కదా.

మొదటి సినిమా హిట్‌, సెకండ్‌ మూవీ కల్కీ నిరాశ పర్చింది కదా దానిపై మీ అభిప్రాయం?

కల్కీ నేను రాసుకున్న కథ కాదు. ఆ సినిమాకు నన్ను దర్శకుడిగా నియమించుకున్నారు. నా బాధ్యతను నేను నిర్వర్తించాను. నా టీం నేను అంతా ఆ సినిమా కోసం చాలానే కష్టపడ్డాం.

హిందీ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’కి దర్శకత్వం వహించారు. కాని మీరు ఆ క్రెడిట్‌ వద్దన్నారు ఎందుకు?

నేను ఆ సినిమాకు కమిట్‌ అయిన సమయంలో చాలా వరకు షూటింగ్‌ పూర్తి అయ్యింది. అందుకే ఆ సినిమా క్రెడిట్‌ నాకు వద్దన్నాను. నేను కేవలం నిర్మాత కోసం ఆ సినిమాను పూర్తి చేశాను అంతే.

చిరంజీవి గారికి కూడా కథ చెప్పాను అన్నారు కదా ఏమైంది?

సైరా చిత్రం షూటింగ్‌ ప్రారంభంకు ముందే చిరంజీవి గారికి కథ చెప్పాను. సైరా కంటే ముందు ఒక సినిమాను స్పీడ్‌గా చేయాలని ఆయన భావించారు. కాని ఆ తర్వాత ఆలోచన మార్చుకున్నట్లుగా ఉన్నారు. నేను కథ చెప్పాను. నా కథ నచ్చిందని అన్నారు. మెగాస్టార్‌ గారి నుండి కాల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను.

స్టార్‌ హీరోతో వర్క్‌ చేసే ప్లానింగ్‌ ఏదైనా ఉందా?

ఇప్పుడే నేను ఏమీ చెప్పలేను. స్టార్స్‌ ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు వారితో వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు వెయిట్‌ చేయాలి. కనుక అది ఎప్పుడు సాధ్యం అవుతుందో నేను చెప్పలేను.

మీరు ‘అ! 2’ ప్రకటించారు. అందులో స్టార్స్‌ నటిస్తారా లేదంటే వాళ్లనే రిపీట్‌ చేస్తారా?

చాలా రోజుల క్రితమే అ! 2 స్క్రిప్ట్‌ పూర్తి చేశాను. బాలీవుడ్‌ నిర్మాత ఒకరు ఆ సీక్వెల్‌ ను హిందీలో చేసేందుకు సంప్రదించారు. ప్రయత్నాలు జరిగినా అది వర్కౌట్‌ కాలేదు. తెలుగులోనే ఆ సినిమాను చేయాలనుకుంటున్నాను. అయితే నటీనటులు ఎవరు అనే విషయం ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు ఖాళీ ఉంటారో ఎవరు ఈ సినిమాకు ఓకే చెప్తారో ఇప్పుడే చెప్పలేం కదా.

మీకు నాని గారికి విభేదాలనే పుకార్లు ఉన్నాయి కదా నిజమేనా?

అబద్దం. నేను నాని గారి ఆఫీస్‌కు వెళ్తూనే ఉంటాను. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఆయన కూడా ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యంగా ఉన్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత మీరు చేయబోతున్న సినిమాలు ఏంటీ?

అ!2 చిత్రంతో పాటు ఒక ప్రేమ కథను సిద్దం చేసి ఉంచాను. ఇంకా రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాను. హాట్‌ స్టార్‌ కోసం రెండు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాను. ఇందులో ఏ సినిమాలు ముందు చేస్తానో ఇప్పుడే చెప్పలేను.

మీరు ఎవరితో వర్క్‌ చేయాలనుకుంటున్నారు?

చాలా మందితో చేయాలని ఉంది. మహేష్‌బాబు గారు, నాని సర్‌, ఎన్టీఆర్‌ గారితో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎన్టీఆర్‌ గారితో ఎనర్జిటిక్‌ కథ చేయాలని అనుకుంటున్నాను.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...