ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే.
మరో ఏడాది కాలంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నట్లుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు. కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా బిజెపి పట్టు సాధించడం కోసం తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నాడు.
తాజాగా మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి ని ఏపీ సీఎం జగన్ పరిపాలనపై స్పందించాల్సిందిగా కోరిన సమయంలో మొదట నిరాకరించాడు. ఆ తర్వాత జగన్ పరిపాలన గురించి ఇప్పుడు ఇలా రోడ్డుపై మాట్లాడను అంటూ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు.
కచ్చితంగా ఒక రోజు జగన్ పరిపాలన గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి మాట్లాడుతాను అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. బిజెపి కి మొదటి నుండి కూడా వైకాపా కాస్త మెతక వైఖరితోనే అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటుంది. కనుక బిజెపి నాయకులు కూడా వైకాపా పై బాహాటంగా విమర్శలు చేయడం కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడను అంటూ మాట దాట వేశాడు.