Switch to English

సేవ ముసుగులోనూ దోపిడీనే.. జగన్ మేనత్త నిర్వాకం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

సేవ చేస్తామని చెప్పి రూ. కోట్ల విలువైన భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆసుపత్రి కట్టి పేదలకు ఉచిత వైద్య సాయం అందిస్తామని నమ్మబలికి అక్కడ చర్చి మాత్రం కట్టించారు. ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రి ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే విచిత్రమైన కారణం చెబుతున్నారు అదేంటో తెలుసా.. అక్కడ హాస్పిటల్ కట్టడానికి మట్టి స్వభావం సరిగా లేదట. కానీ ఆగమేగాల మీద చర్చి మాత్రం కట్టేశారు.

సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది. క్రిస్టియన్ కమ్యూనిటీ, బీసీ ఎస్సి, ఎస్టీ మహిళల సాధికారత కోసం నర్సింగ్ శిక్షణ ఇస్తామని అందుకు అవసరమైన స్థలం కేటాయించాలంటూ ఆ సంస్థ 2004లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులకు అనుగుణంగా భవనాలు నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమిని కేటాయించాలని, పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామంటూ ఆ సంస్థ అప్పట్లో ప్రభుత్వానికి నివేదించింది. 2006 లో ఆ సంస్థ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే 2009 ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 లో క్యాబినెట్ తిరస్కరించినప్పటికీ వైయస్ కుటుంబ సభ్యుల జోక్యం ఉండటంతో సెయింట్ లూక్స్ కి విలువైన భూమిని దారాదత్తం చేశారు.

ఆ మిషనరీ సంస్థకు 7.5 ఎకరాలు కేటాయించగా అందులో రోడ్డు విస్తరణ కు పోగా 6 ఎకరాలకు పైగా భూమి ఆ సంస్థ అధీనంలో ఉంది. ఇందులో కొంత భాగం నర్సింగ్ శిక్షణ కోసం మూడు రేకుల షెడ్డులు నిర్మించి మమ అనిపించేశారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద ఓ చర్చిని నిర్మించారు. ఏపీ మాజీ సీఎం జగన్ మేనత్త వైయస్ విమల రెడ్డి అక్కడికి వచ్చి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సాగర తీరానికి చేరువలో సముద్రానికి అభిముఖంగా స్థలం ఇవ్వాలని కోరడం, ఇప్పటికీ అక్కడ ఆసుపత్రి నిర్మించకపోవడంతో విలువైన భూమిని దక్కించుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ 300 కోట్లకు పై మాటే మరి ఆసుపత్రికి కట్టడానికి అనువుగా లేని స్థలంలో చర్చి ఎలా కట్టారో వైఎస్ విమలా రెడ్డికే తెలియాలి.

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

ఎట్టకేలకు.. రెండవ వివాహం చేసుకున్న సమంత!

దీర్ఘకాలంగా ఊహాగానాల మధ్య ఉన్న నటీమణి సమంత రూత్ ప్రభు  చివరకు తన రెండవ వివాహం పూర్తి చేసుకున్నారు. దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగ...

ఆర్టీసీ బస్సులో సీటు రగడ… ప్రయాణికుడిపై మహిళల దాడి

తుని–నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో సీటు కోసం పెద్ద రగడ జరిగింది. ప్రయాణికుడు కూర్చున్న సీటుపై ముందుగా తాము కర్చీఫ్ వేసుకున్నామని చెప్పిన మహిళలు తీవ్ర కోపంతో అతనిపై దాడికి తెగబడ్డారు. కర్చీఫ్ ఉన్న...

పవన్ కళ్యాణ్ విజయం కోసం తెలంగాణ యువకుని దీక్ష…

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన యువకుడు చట్టా సతీష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపట్ల తనకున్న ఆరాధనను నిరూపించుకున్న హృదయాన్ని హత్తుకునే సంఘటన బుధవారం జరిగింది. ప్రజారాజ్యం రోజుల్లో...

Daily Horoscope: డిసెంబర్ 5, 2025 శుక్రవారం రాశిఫలాలు

మేషం (Aries): ఈరోజు పనుల్లో కొంత వేగం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచిది జరిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది....

పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై భుజాలు తడుముకుంటున్న తెలంగాణ లీడర్స్

కోనసీమలో కొబ్బరి చెట్టుకి ఏదన్నా తెగులు సోకితే, ‘నర దిష్టి’ అనడం అక్కడ సర్వసాధారణం.! కోనసీమ ఉప్పెన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో, ‘మన కొబ్బరికి దిష్టి తగిలింది’ అని అక్కడి రైతులు మాట్లాడుకోవడం...