ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. అయితే ఈ కార్యక్రమం పరిమిత ఆహ్వానితులకు మాత్రమే నిర్వహించనున్నట్లు విరోష్ టీమ్ స్పష్టం చేసింది.
రిసెప్షన్కు కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మరియు పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు కార్యక్రమ స్థలానికి రాకూడదని పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరైనా ఆహ్వానం లేకుండా వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.
పోలీస్ ఆంక్షల నేపథ్యంలో విరోష్ జంట కూడా అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మీ భద్రత మాకు ముఖ్యమని, ఆహ్వానం లేకుండా రాకుండా సహకరించాలని కోరింది. మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీస్సులు, ప్రేమ మాతోనే ఉంటాయని, అదే మాకు పెద్ద బలం అని టీమ్ తెలిపింది. అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే అందరి క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకలు ఇప్పటికే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, హైదరాబాద్ రిసెప్షన్పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. అయితే కార్యక్రమం ప్రశాంతంగా, భద్రతతో జరిగేలా అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
