Switch to English

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,204FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల భాగంగా నిర్వహించిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ బలోపేతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఒక విశ్వవిద్యాలయంలాంటిదని, పార్టీ ఇచ్చిన అవకాశాలు, గుర్తింపు, గౌరవం అన్నీ గుర్తుంచుకుని నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో పనిచేసిన ఎన్నో మంది నేటి రాష్ట్ర నాయకులుగా ఎదిగారని గుర్తుచేస్తూ, అందరూ అదే దారిలో ముందుకు సాగాలన్నారు.

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో తప్పకుండా భాగస్వామ్యం కావాలని లోకేష్ స్పష్టం చేశారు. చిన్న సమస్యలు సహజమని, అలకలు వద్దని, ఏ విషయం ఉన్నా సంబంధిత నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలతో అనుబంధం పెంచుకోవడం అత్యంత ముఖ్యం అని, తమ ప్రాంత ప్రజలతో మమేకం అయితే మాత్రమే నిజమైన నాయకత్వం నిలుస్తుందని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన అణచివేతలను ప్రస్తావిస్తూ, టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేశారు. సైకో పాలనతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని అందరూ ఒకే దారిలో కష్టపడాలన్నారు.

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

ప్రతి నాయకుడు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో కలిసి పని చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. అహంకారం దూరంగా ఉంచి, ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ స్పష్టంగా వివరించాలని, దేశంలో ఎక్కడా లేనంతగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. చేస్తోన్న పనిని గర్వంగా చెప్పాలని, ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు ‘మై టీడీపీ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయాలని సూచించారు.

లోకేష్ మాట్లాడుతూ, నాయకులు జీవితాంతం నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి, కష్టపడి పనిచేశాకే నిజమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడం వల్లే నేటి స్థాయికి చేరుకున్నానని, అదే మార్గంలో అందరూ కృషి చేయాలని సూచించారు. శిక్షణా తరగతుల తొలి రోజున రాష్ట్రవ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు అశోక్, శిరీషలతో పాటు పలువురు నాయకులు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణంపై నేతలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల నాయకులు తమ అభిప్రాయాలను లోకేష్‌కి తెలుపగా, ఆయన కార్యక్రమం ముగింపులో ఆలోచనాత్మక సూచనలు చేశారు.

సినిమా

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

రాజకీయం

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె మరోసారి రాజకీయ, కుటుంబ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర ప్రసాద్ గారు”

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక…రెండో రోజు నుంచే ఒక...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...