ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా.. ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి కావాలనే తీసుకొచ్చిందన్నారు. కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టాల్సిన ఉద్యోగులంతా ఉద్యమంలోనే ఉన్నారన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యోగులుగా చేయగలిగినంత చేస్తామని బొప్పరాజు వెల్లడించారు. ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవొద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ఈ నెల జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. జీతాలు రాకుంటే ఊరుకునేది లేదన్నారు.
ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రేపట్నుంచి మమ్మల్ని ఏమైనా చేయొచ్చన్నారు. తమ ఇళ్లపై దాడి చేసి మమ్మల్ని అరెస్ట్లు కూడా చేయొచ్చని అన్నారు. అయినా తాము భయపడేది లేదని, సమ్మె తమ జన్మహక్కుగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తమకు పీఆర్సీ ఒక్కటే సమస్య అయితే.. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలేనని అన్నారు.
92291 470383I like this internet web site very a lot, Its a actually nice post to read and get information . 878616
642995 833389Aw, this became an extremely nice post. In thought I would like to set up writing like that in addition – taking time and actual effort to create a terrific article but what / points I say I procrastinate alot via no indicates appear to get something completed. 789291