Switch to English

2027 చివర్లో ఎన్నికలట.! విసారె కొత్త జోస్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,128FansLike
57,764FollowersFollow

వై నాట్ 175 జోస్యం నవ్వులపాలైపోయినా, వైసీపీ నేతలు ‘జోస్యం’ చెప్పడం మాత్రం మానడంలేదు.! కొత్తగా 2027 చివర్లో ఎన్నికలంటూ వైసీపీ కొత్త జోస్యం షురూ చేసింది. దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, 2029 నాటికి తప్ప, ఈలోగా జమిలి ఎన్నికలకు ఆస్కారమే లేదన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 2028 చివరి నాటికి జమిలి ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధతకు ఆస్కారం వుంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే, 2029లో సాధారణ ఎన్నికలే, దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు కాబోతున్నాయన్నమాట.

మరి, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎందుకు 2027 చివర్లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతున్నట్లు.? ఇదేమీ వింత కాదు.. నిజానికి, రేపో ఎల్లుండో ఎన్నికలు జరిగితే బావుండని వైసీపీ భావిస్తున్నట్లుగా వుంది ఆ పార్టీ పరిస్థితి.

ఇటీవలి ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీ, నిజానికి కోలుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే వైసీపీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పేశారు. మరికొందరు, పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు, ‘త్వరలోనే ఎన్నికలు’ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నమాట వైసీపీ.

వాస్తవానికి, ఈ ‘జమిలి’ ప్రచారం కూడా వైసీపీకి చేటు చేస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గా పునర్ విభజన.. వంటి వ్యవహారాలు చాలానే వున్నాయి. వైసీపీకి ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లే వచ్చిన దరిమిలా, ఆ పార్టీలో వుండడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితి.

కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఒకింత వ్యూహాత్మకంగా అడుగులేస్తూ, పార్టీ ఫిరాయింపుల విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. అలాకాకుండా, పార్టీ ఫిరాయింపుల్ని గనుక ప్రోత్సహిస్తే, వైసీపీ అనేది కాలగర్భంలో కలిసిపోవడానికి పెద్దగా సమయం పట్టదు.

ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, 2027 చివర్లో జమిలి ఎన్నికలకు ఆస్కారం వుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరుకి పరిమితమయ్యేవారే కాదు. వీకెండ్ రాజకీయాలు చేస్తే, వైఎస్ జగన్ టైమ్ పాస్ చేస్తున్నారంటేనే దానర్థం, ఇప్పట్లో ఎన్నికలు లేవని.

కాగా, జమిలి ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్నది కూటమి ప్రభుత్వమే.

ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు విజయసాయిరెడ్డి, జమిలి ఎన్నికల్ని ప్రస్తావిస్తూ, ప్రశంసిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేస్తోంటే, బీజేపీలోకి విజయసాయిరెడ్డి దూకేస్తారేమోనన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ఆర్థిక లాభ సూచనలు మేషం వారికి, ఉద్యోగంలో పురోగతి కన్య వారికి

జనవరి 8, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు చంద్రమాన ప్రభావంతో ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ...

పీఠికాపురంలో ముందే సంక్రాంతి సంబరాలు… పవన్ కళ్యాణ్ సందడి

పీఠికాపురం అచ్చతెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ముందస్తు సంక్రాంతి కాంతులతో వెలిగిపోయింది. మూడు రోజుల పాటు జరగనున్న సంక్రాంతి మహోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. పల్లె...

భూమి రక్షణతోనే రైతు ఆదాయం పెరుగుతుంది: గ్రీన్ కవర్‌పై దృష్టి

భూ మాతను కాపాడుకుంటూనే రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యాన సాగులో వైవిధ్యం తీసుకురావడం భూమికి రక్షణ కవచంలా...

అయ్యా జగన్ గారూ .. ఇప్పుడిప్పుడే దారిన పడే రాజధానిని మళ్ళీ చెడగొట్టడం అవసరమా?!

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం చిమ్మారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కీలక...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...