విశాఖ జిల్లాలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది. ఆదివారం జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్ లో పాల్గొనబోతున్న 90 మందికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. వెంటనే వీరందరినీ ఐసొలేట్ చేయాలని విశాఖ జేసీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా తీసుకుంటామని వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ ఏంజెట్లుగా అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్లకు కొవిడ్ టెస్టులు చేయడంతో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 1,174 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 55,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
257950 400976I enjoy your work , regards for all of the informative posts . 621490