తమ హక్కులను కాలరాస్తూ సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సస్పెన్షన్ విషయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు సూచనను తిరస్కరించారంటూ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరుతో ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ నేతలు పాల్గొన్న ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ..
’తన ఓటమి కోసం వందల కోట్ల అక్రమ సంపాదన ఖర్చు చేసిన కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నన్ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తే.. సమావేశాల్లో పాల్గొనకుండా చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడల్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు’.
‘గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాల్ని ఏడు రోజులే నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. హైకోర్టు తీర్పునూ స్పీకర్ గౌరవించలేదు. ప్రజా క్షేత్రంలోనే న్యాయం జరుగుతుందని దీక్ష చేపట్టాం. రాజ్యంగంలోని ఆర్టికల్-3 లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ గమనించాలి’ అని అన్నారు.
640874 752230What a lovely weblog. I will certainly be back once more. Please sustain writing! 305637
123765 985672 There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in functions also. 290543