Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థ చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. ఆయన వయసు 88ఏళ్లు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తెల్లవారుఝామున 4.50నిముషాలలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న ఆయనకు అస్వస్థత కలగడంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన భౌతికకాయాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో 1936లో జన్మించిన రామోజీ అసలు పేరు చెరుకూరి రామయ్య. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు జర్నలిజంలో ఓ విప్లవమే తీసుకొచ్చారు. కళారంగంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై దాదాపు 65 సినిమాలు నిర్మించి నిర్మాతగా రాణించారు.
ఈనాడు పత్రికను ప్రజలకు చేరువ చేసి పత్రికలపై తెలుగు ప్రజలకు వార్తలు అందించడంలో ముందడుగు వేశారు. ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. రామోజీరావు మృతిపై ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.