అనంతపురం జిల్లా, తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహిస్తోంది. ఆయనతోపాలు క్లాస్ 1 కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఈరోజు తాడిపత్రి చేరుకున్న అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఆస్తి పత్రాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
సోదాల్లో మొత్తం 20 మంది అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోదాల సమయంలో జేసీ కుటుంబసభ్యుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బయటి వ్యక్తులు ఎవరూ లోనికి రాకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
248643 924241Some truly wonderful content on this web web site , thankyou for contribution. 18050