టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ దుమారం రేపింది. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు.
సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించనుంది. వీరితో పాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేసింది.
గత రెండు నెలల కింద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఎంత దుమారం రేగిందో చూశాం. నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలతో వీరందరిపై అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ అందులో కొందరినే విచారణకు పిలిచారు. హీరోలు, స్టార్ యాక్టర్లను మాత్రం విచారణకు పిలవలేదు.
వారు హైకోర్టులకు వెళ్లి అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
