మాజీ మంత్రి రోజా ఎక్కడ.? ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఎక్కడ.? మాజీ హోంమంత్రి తానేటి వనిత ఎక్కడ.? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తన భార్యని కాదని, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, కన్న కూతుళ్ళనీ దూరం పెడితే ఎవరూ మాట్లాడరేం.?
తమ తండ్రి కోసం దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు, ఆయన ఇంటి దగ్గర బైఠాయించాల్సిన పరిస్థితి వస్తే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు.? దారి తప్పిన దువ్వాడ శ్రీనివాస్ విషయమై, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.?
‘ఔను, మేమిద్దరం కలిసే వున్నాం. నాకు భర్త, కుటుంబం వుంది. పిల్లలూ వున్నారు. ప్రస్తుతానికైతే స్నేహితులం. నా కేర్ టేకర్ ఆయన. అడల్ట్రీ తప్పు కాదని సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది. భవిష్యత్తులో మా ఇద్దరి బంధం ఎలాగైనా మారొచ్చు..’ అని దువ్వాడతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మీడియా ముందుకొచ్చే చెబుతోంది అన్నీ.
మరోపక్క, తన భర్త తనను కాదని, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి మీడియా ముందుకొచ్చారు. చిత్రమేంటంటే, ఎన్నికల ముందర టిక్కెట్ కోసం దువ్వాడ శ్రీనివాస్ – అతని భార్య మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు కూడా.!
గతంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలోని అత్యంత అసహ్యకరమైన పరిస్థితులు బయటపడ్డాయ్. మొత్తంగా దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు.