భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.
దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి.
రూ.184 కోట్ల వ్యయంతో 754.38 మీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెనను పూర్తి చేశారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా కేవలం రెండు పిల్లర్లపై ఈ వంతెనను ఎల్అండ్టీ సంస్థ నిర్మించింది.
ఈ వంతెన ప్రారంభం కావడంతో జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ మేర దూరం తగ్గనుంది. బ్రిడ్జికి ఎల్ఈడీ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనిపై మొత్తం 40వేల ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దుర్గం చెరువును ప్రభుత్వం పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తోంది.
ఈ బ్రిడ్జిపైకి ప్రతి శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించరు. వారాంతాల్లో కేవలం పర్యాటకులకు మాత్రమే కాలినడకన అనుమతిస్తామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
740708 400677The posh distributed could be described as distinctive; customers are truly yearning for bags is really a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 378162
322116 636103Glad to be 1 of many visitants on this remarkable internet website : D. 728659
979926 277727Some truly nice stuff on this web site , I it. 743802
890066 250395Ive applied the valuable points from this page and I can surely tell that it gives lots of assistance with my present jobs. I would be extremely pleased to keep finding back in this internet page. Thank you. 383374