కరోనా కొన్ని లక్షల జీవితాలను చిద్రం చేస్తోంది. చాలా మంది కరోనాతో మరణిస్తూ ఉంటే మరి కొందరు కరోనా భయంతో మరణిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు కరోనా వల్ల వచ్చిన ఆర్థిక కష్టాలను భరించలేక మృతి చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే వీరిద్దరు కూడా కరోనాను జయించారు కాని కరోనాతో వచ్చిన ఆర్థిక సమస్యలను జయించలేక పోయారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఫణిరాజ్ మరియు శిరీష దంపతులు బెల్లం వ్యాపారం చేస్తూ ఉండేవారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది. దానికి తోడు ఫణిరాజ్ తల్లికి కరోనా రావడంతో అనుమానంతో వీరిద్దరు కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందగా ఈ భార్య భర్తలు ఇద్దరు మాత్రం కరోనాను జయించారు.
కరోనా నెగటివ్ అంటూ వచ్చిన తర్వాత కూడా బంధువులు మరియు మిత్రులు దగ్గరకు రాకపోవడంతో పాటు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు పీకలమీద కూర్చున్నారు. మూగవాడు అయినా కూడా ఫణిరాజ్ బాగానే వ్యాపారం చేశాడు. కాని ఆయన కరోనా కారణంగా నష్టాల్లో మునిగి పోయి చివరకు మూడు అంతస్తుల భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఒక్కగానొక్క కుమారుడిని తాత వాళ్ల ఇంటి వద్ద వదిలేసి దంపతులు ఈ పని చేశారు.
122613 287939Uncover out these pointers read on and learn to know how to submit an application performing this that you policy your corporation today. alertpay 623430