మే 16వ తేదీన మద్యం మత్తులో డా. సుధాకర్ నడిరోడ్డులో రభస చేయడమే కాకుండా, అధికార పార్టీపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మెంటల్ కండిషన్ బాలేదని చెప్పి అతన్ని విశాఖ మెంటల్ హాస్పిటల్ కి తరలించిన సంగతి తెలిసిందే..
విశాఖ మెంటల్ హాస్పిటల్ లో ఉన్న డా. సుధాకర్ నేడు హాస్పిటల్ సూపరింటెండెంట్ కి లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ లేఖలో ‘తనకు ఇచ్చే మందులపై పలు అనుమానాలు ఉన్నాయని, అందుకే రోజూ తనకు ఇచ్చే మందుల్ని లిస్ట్ చేసి ఈ లేఖలో రాస్తున్నానని, వాటి కారణంగా తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆరోపణలు చేయడమే కాకుండా వాటి ఫలితంగా పెదవులపై వచ్చిన మచ్చల్ని ఫోటోల రూపంలో జతపరిచారు. అందుకే తన మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అలాగే మొదటి సారి తను మాస్కుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటి నుంచీ మొన్నటి మద్యం టెస్ట్ వరకూ అన్నీ ఈ లేఖలో’ పేర్కొన్నాడు. ప్రస్తుతం డా. సుధాకర్ కేసుపై సిబిఐ విచారణ చేస్తుంది.
268973 965395some truly intriguing information , well written and broadly speaking user genial . 824733
133733 889313Just wanna comment which you have a extremely good web site, I the style and style it truly stands out. 687740
664601 583651Some truly nice stuff on this website , I it. 50279