Karnataka: కర్ణాటక (Karnataka) రాజకీయం నిన్న అర్ధరాత్రి ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం సీటు కోసం బెట్టు చేసిన పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Siva Kumar) అధిష్టానం చర్చలతో మెత్తబడినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటక తదుపరి సీఎంగా సిద్ధరామయ్య (Siddaramaiah) , డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేసినట్టు తెలిపాయి.
సీఎం సీటు కోసం జరిగిన తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఇరు నేతలతో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిన్న విస్తృతమైన చర్చలు జరిపారు. అర్ధరాత్రి దాటే వరకూ ఈ చర్చలు కొనసాగినట్టు సమాచారం. ఎట్టకేలకు అధిష్టానం బుజ్జగింపులకు డీకే శివకుమార్ అంగీకరించారని.. దీంతో ఎడతెగని ఉత్కంఠకు తెరపడిందని అంటున్నారు.
అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. నేడు బెంగళూరులో డీకే శివకుమార్ సీఎల్పీ భేటీ నిర్వహించి అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కొత్త సీఎం మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
You should take part in a contest for one of the most
useful sites on the internet. I will highly recommend this blog!