మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుంది. ఈ మద్యే ఢిల్లీ లో షూటింగ్ పూర్తీ చేసారు. వరుస ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్న మాస్ రాజాకు ఇప్పుడు సరైన హిట్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే వరుస పరాజయాల తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న రవితేజ సెకండ్ ఇన్నింగ్ మొదలెట్టాడు.
సెకండ్ ఇన్నింగ్ లో అయినా సరైన సక్సెస్ వచ్చిందా అంటే .. ఇప్పుడు వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఇప్పటికే దర్శక నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఏది లేదని టీమ్ స్పష్టం చేసింది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విషయంలో భిన్నమైన పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు బడ్జెట్ తడిసి మోపెడైందట. నిజానికి 17 కోట్ల వరకు అనుకున్నారట .. కానీ ఇప్పటికే 22 కోట్లు దాటిందట. ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉంది . దాంతో పాటు రిలీజ్, ప్రమోషన్ ఇవ్వన్నీ కలిపి ముప్పై దాక అవుతుందని నిర్మాత టెన్షన్ పడుతున్నారట. ప్రస్తుతం రవితేజ కు మార్కెట్ బాగా లేదు .. ఇప్పుడు ఈ సినిమాకు ముప్పై కోట్లు ఖర్చయితే, ఈ సినిమాను ఇంతకు అమ్మితే నిర్మాత సేఫ్ అవుతాడు. ఈ విషయంలో నిర్మాతకు టెన్షన్ తప్పదని ట్రేడ్ వర్గాల్లో టాక్ రావడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
