యువదర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో రాబోతున్నాడు. మొదరి చిత్రం అ! తో విమర్శకుల మెప్పు సాధించిన ప్రశాంత్ రెండో ప్రయత్నంగా సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే చిత్రం తెరకెక్కించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేదు.
కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేసాడు. రేపు ఉదయం 9గంటలకు చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు.
‘కరోనా వాక్సీన్’ …10% …లోడింగ్..ప్రిలిమినరీ టెస్ట్ అంటూ ఆసక్తికర పోస్టర్ ను పంచుకున్నాడు. సినిమా పేరు, నటీనటులు ఇతర వివరాలు తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
తన తొలి రెండు చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆ చిత్రాల క్లైమాక్స్ సన్నివేశాలను ప్రతిబింబించేలా రూపొందించిన ప్రశాంత్ వర్మ మూడో చిత్రం ఫస్ట్ లుక్ విషయంలో కూడా అదే పంధాను కొనసాగిస్తాడేమో చూడాలి. మరో వైపు తొలి చిత్రం అ! కు సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు ప్రశాంత్ గతంలో ప్రకటించాడు.
ప్రస్తుతమున్న కమిట్ మెంట్స్ పూర్తయ్యాక చిత్రీకరణ పనులను మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. అయితే అ! ను నిర్మించిన వాల్ పోస్టర్ సినిమానే సీక్వెల్ ను కూడా నిర్మిస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి.
ANNOUNCEMENT: pic.twitter.com/Fh0XvJmvpI
— Prasanth Varma 4.0 (@PrasanthVarma) May 28, 2020