Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఆమధ్య వచ్చిన టీజర్ పై వచ్చిన కామెంట్స్, హీరోయిన్లు ఎంతమందనే విషయాలపై చిత్ర దర్శకుడు వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష. సెకండ్ హీరోయిన్ ఆషికా రంగనాధ్. మిగిలిన నటీమణులు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. సినిమా టీజర్ పై వచ్చిన విమర్శలు గమనించాను. నాకు నచ్చింది అనిపించాకే ఆ టీజర్ రిలీజ్ చేశాము. అయితే.. దానిని అవతార్ తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. కొండలు, పూలతోటలు, పాప చెవులు చూసి ఆ మాట అన్నారు. నిజానికి ఇవన్నీ అంతకుముందు చాలా సినిమాల్లో ఉన్నవే’.
‘నేను చిన్నప్పటి నుంచీ చందమామ కథలు ఎక్కువగా చదివాను. నా సినిమాల్లో వాటి ప్రభావం ఉంటుంది. విశ్వంభర్ టీజర్ ను వాటితో పోల్చినా నేను ఇంకా సంతోషపడేవాడిని. అవతార్ కంటే ముందే మన కథల్లో అవి ఉన్నాయ’ని క్లారిటీ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా త్వరలో విడుదలవుతోంది.
