” ఏడు చేపల కథ” ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో అభిషేక్ పచ్చిపాల. ఇప్పుడాయన హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా “జస్ట్ ఎ మినిట్” అనే సినిమా రూపొందుతోంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, కార్తీక్ ధర్మపురి సమర్పణలో సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్, ప్రకాష్ ధర్మపురి ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” కార్తీక్ ధర్మపురి తో నాకు ఎంతో అనుబంధం ఉంది. సుధర్మ మూవీ మేకర్స్ లోగో, “జస్ట్ ఎ మినిట్” మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టెక్నికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆయన. ఈ సినిమాతో ప్రొడక్షన్ వైపు వచ్చారు. అదేవిధంగా ఈ సినిమా హీరో అభిషేక్ రెడ్డి గతంలో చేసిన “ఏడు చేపల కథ” మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరో మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నారు. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఈ సినిమాలో ఇషిత సింగ్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి కీలక పాత్రలు పోషిస్తున్నారు.