డిజిటల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ల మధ్య ఇండియన్ మార్కెట్ పై ఆధిపత్యం జరుగుతూనే ఉంది. అంతర్జాతీయ కంటెంట్ వరకూ నెట్ ఫ్లిక్స్ దే పై చేయి అయినా కూడా ఇండియన్ కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ వెనకపడుతూనే ఉంది. పైగా నెట్ ఫ్లిక్స్ నిర్మించిన పలు సినిమాలు దారుణమైన రేటింగ్స్ ను సొంతం చేసుకుని విమర్శల పాలవుతున్నాయి.
ఇక ప్రస్తుతం థియేటర్లు లేని కారణంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ దే పై చేయిగా మారింది. ఈ నేపథ్యంలో భారీ ఆఫర్లతో నిర్మాతలను విడుదలకు సిద్ధమైన సినిమాల వరకూ ఊరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు అవుతాయో తెలీక నిర్మాతలు కూడా తలలు పట్టుకునే పరిస్థితి. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. నిన్ననే ఆయుష్మాన్ ఖురానా, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన గులాబో సితాబో విడుదల గురించి విన్నాం.
ఇక ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఏకంగా ఏడు భారతీయ సినిమాలను ప్రకటించి సంచలనం సృష్టించింది. గులాబో సితాబో కాకుండా జ్యోతిక నటించిన సూర్య నిర్మించిన పోంమగళ్ వందాల్ చిత్రం మే 29 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన కన్నడ చిత్రం ఫ్రెంచ్ బిర్యానీ జులై 24 నుండి విడుదల కావడానికి ఒప్పందం చేసుకుంది.
మరో కన్నడ సినిమా లా జూన్ 26న విడుదల కానుంది. కీర్తి సురేష్ నటించిన తమిళ – తెలుగు చిత్రం పెంగ్విన్ జూన్ 19న విడుదలవుతుంది. ఇక విద్యాబాలన్ నటించిన శకుంతలా దేవి, అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సూఫీయుమ్ సుజాతియుమ్ కూడా ప్రైమ్ లో విడుదల కానున్నాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని సినిమాలు ఈ దారిలో నడవనున్నాయి.
661992 827834Some truly marvelous work on behalf of the owner of this web site , dead great topic matter. 800753