అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాలపై ఈ మధ్య చాలా రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఇవి నిజం కాదని స్పష్టం చేస్తున్నాము” అని ఆయన తెలిపారు.
కొన్ని పాత గాసిప్లను ఇప్పటి పరిస్థితులకు కలిపి తప్పుగా ప్రచారం చేస్తున్నారని దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్లో ఉందని, ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
“ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మా సంస్థవద్ద నుంచే అధికారికంగా ప్రకటిస్తాము. అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణలకు రాకుండా, ధృవీకరించని సమాచారం మీ మీడియా ప్లాట్ఫార్మ్లలో ప్రచారం చేయవద్దని మనవి” అని దిల్ రాజు మీడియా మిత్రులను కోరారు.
