ఓటిటి కంటెంట్ ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తోంది. సినిమా వాళ్ళు కూడా ఓటిటి కంటెంట్ ను గుర్తించడం మొదలుపెట్టారు. తెలుగులో ఈ హవా ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడిప్పుడే దర్శకులు, స్టార్లు, నిర్మాతలు ఓటిటి కంటెంట్ ను గుర్తిస్తున్నారు.
తాజాగా దిల్ రాజు, హరీష్ శంకర్ కలిసి ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించారు. ఏటిఎమ్ టైటిల్ గా ఒక హీస్ట్ సిరీస్ ను తీయబోతున్నారు. హరీష్ శంకర్ కథ అందించిన ఈ సిరీస్ ను జీ5 సంస్థ స్ట్రీమ్ చేస్తుంది. సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తాడు.
ఇది ఒక థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సిరీస్. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డి లతో కలిసి హరీష్ ఈ సిరీస్ ను నిర్మిస్తారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సిరీస్ కు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
484243 261951You can definitely see your enthusiasm within the work you write. 74928
154032 792587Great post is going to be linking this on several web sites of mine keep up the good function. 329954