Dhoom dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో రూపొందుతోందీ సినిమా. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ కథా రచయిత గోపీ మోహన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న “ధూం ధాం” సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అమెరికాలో సైతం సినిమాను గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద “ధూం ధాం”‘మల్లెపూల టాక్సీ..’ పాటను ప్రదర్శించారు.
పాట స్క్రీనింగ్ కు భారీగా ఎన్ఆర్ఐలు హాజరై పాటకు డ్యాన్సులు చేశారు. సెప్టెంబర్ 12న సినిమా యూఎస్ ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ అంటున్నారు.