విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాపై డీజీసీఏ (DGCA) తీవ్ర చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎయిరిండియాకు రూ.30లక్షల జరిమానా విధించింది. ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమాన పైలట్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. విమానాల్లో సేవలు పర్యవేక్షించే డైరక్టర్ కు రూ.3లక్షలు జరిమానా విధించింది.
ఇప్పటికే కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు ఎయిరిండియా విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అయితే.. నిందితుడు శంకర్ మాత్రం తాను తప్పు చేయలేదని పేర్కొన్నాడు. ‘నేను నిందితుడిని కాదు. ప్రొస్టేట్ కు సంబంధించిన సమస్యతో బాధపడుతూ మహిళే మూత్ర విసర్జన చేసుకుంది. నేను మూత్ర విసర్జన చేయలేదు’ అని జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు కోర్టుకు తెలిపాడు.
మరోవైపు డీజీసీఏ ఆదేశాలపై ఎయిరిండియా స్పందించింది. డీజీసీఏ ఉత్తర్వులు అందాయి. ప్రయాణికులకు జరిగే అసౌకర్యాలపై ఎలా వ్యవహరించాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపింది.
572979 206059Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get truly enjoyed account your weblog posts. Any way I will likely be subscribing to your augment and even I achievement you access consistently speedily. 813207
745095 291747Id must verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that may make folks feel. Furthermore, thanks for permitting me to comment! 550500