రణ్బీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అమితాబచ్చన్, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన కుంకుమల పాట సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి రెండవ పాట ను విడుదల చేశారు. దేవ దేవ.. అంటూ ఆధ్యాత్మికత మరియు ఉల్లాసభరితంగా ఈ రెండవ పాట సాగుతుంది. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటకు, చంద్రబోస్ సాహిత్యం అందించగా.
శ్రీరామ చంద్ర మరియు జోనితా గాంధీ ఆలపించారు. ఈ పాట గురించి నటుడు రణబీర్ కపూర్ మాట్లాడుతూ… నేను పాటను పూర్తిగా ఆస్వాదించాను మరియు వ్యక్తిగతంగా దానితో సంబంధం కలిగి ఉండగలిగాను. నేను చెందినంతగా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారని మరియు ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను.
పాట ఆడియో-విజువల్ గురించి తన అనుభవాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. పాటను విడుదల చేయడానికి శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను. ఈ శుభ సందర్భం కేవలం పాట యొక్క ఆకర్షణీయమైన మెలోడీతో మరియు రణబీర్ పాత్ర యొక్క ఆధ్యాత్మిక దృశ్యాలతో ఉండబోతుంది అన్నాడు. పాట అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉందని.. పాట సినిమా యొక్క స్థాయిని మరింతగా పెంచుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
187835 487708building websites is not only fun, but it can also produce an income for yourself;; 601594
714044 464796I see something genuinely interesting about your internet website so I saved to bookmarks . 336703