Switch to English

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల సమావేశం సందర్భంగా వచ్చిన డిమాండ్.

ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగా పాటించకపోవడం వల్ల అక్కడ జనాభా ఎక్కువ వుందనీ, దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగ్గా పాటించడం వల్ల, జనాభా తగ్గిందనీ డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు కూడా.

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, డీఎంకే నేతృత్వంలో చెన్నయ్‌లో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి కేసీయార్ హాజరయ్యారుగానీ, ఏపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, డీలిమిటేషన్ విషయమై గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే.

నియోజకవర్గాల పునర్విభజనే డీలిమిటేషన్. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను పెంచేందుకు ఉద్దేశించిన డీలిమిటేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కావాల్సి వుంది. నిజానికి, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబందించి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అయితే, అది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినది.

అందివచ్చిన అవకాశాన్ని వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకుంటారని వైసీపీ క్యాడర్ చాలా బలంగా నమ్మింది డీలిమిటేషన్ విషయంలో. వైఎస్ జగన్ స్వయంగా ఈ ఉద్యమానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతారని కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు భావించారు.

అయితే, సింపుల్‌గా ఓ లేఖ రాసి, అందులో తన భావాల్ని వెల్లడించేసి ఊరుకున్నారు వైఎస్ జగన్. ‘జగన్ మాతోనే వుంటారని భావిస్తున్నాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సెలవిచ్చారు. అయినా, జగన్ ఎందుకు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు.?

జనసేన, టీడీపీ ఎలాగూ బీజేపీతో కలిసి పొత్తులో వున్నాయి గనుక, బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తున్న డీలిమిటేషన్ పోరులో జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. పాల్గొనే అవకాశం లేదు. వైసీపీ పరిస్థితి అది కాదు కదా.! ఎందుకు కాదు, బీజేపీని ప్రశ్నించాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు. అదీ అసలు సంగతి.

‘అన్నా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు.? మంచి అవకాశాన్ని వదులుకున్నావ్.. డీ లిమిటేషన్ ఉద్యమానికి నువ్వే నాయకత్వం వహించు..’ అంటూ వైసీపీ క్యాడర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహాలు ఇస్తూనే వున్నారు.

అన్నట్టు, త్వరలో తెలంగాణలో ఈ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించిన సమావేశం జరగబోతోందిట. ఆ తర్వాత ఏపీలోనూ సమావేశం పెట్టే ఆలోచనలో స్టాలిన్ సహా, డీలిమిటేషన్ పోరాటంలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీల అధినేతలు వున్నారు.

ఇదిలా వుంటే, చెన్నయ్ సమావేశానికి తమకు కూడా ఆహ్వానం వచ్చిందనీ, అయితే, బీజేపీతో పొత్తులో వున్నందున, ఆ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చామనీ, డీలిమిటేషన్ విషయమై తాము మాట్లాడాల్సిన వేదికలపై మాట్లాడతామని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

పాస్టర్ల గౌరవ వేతనం.. చంద్రబాబు నిర్ణయంతో జగన్ కు షాక్..

సీఎం చంద్రబాబు కొన్ని నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటున్నారు. అవి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ఉంటున్నాయి. వైసీపీకి ప్రచార అస్త్రాలు లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు మరో విషయంలో కూడా...

మా సినిమాను చంపేస్తారా.. విజయశాంతి ఫైర్

నందమూరి కల్యాణ్‌ రామ్ హీరోగా విజయ శాంతి కీలక పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా...

పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెట్రో సందడి మొదలైంది. సూర్య లీడ్ రోల్ లో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో...

చంద్రబాబు తెచ్చిన సంక్షేమ పథకాలు.. పేదలకు భరోసా..

ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వర్గాలు, చేతి వృత్తులు, రైతులు, శ్రామికులు.. ఇలా ఎన్నో...

క్లాస్ సినిమాకు మాస్ సెలబ్రేషన్స్..!

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే ఈ గ్యాప్ లో ఒకప్పటి వారి సినిమాలను...