సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడికి సాయి డిఫెన్స్ అకాడమీ డైరక్టర్ ఆవుల సుబ్బారావు, ప్రతినిధి శివ మద్దతిచ్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘అగ్నిపథ్’ పథకం అమలైతే తమ అకాడమీలకు 20కోట్లు నష్టం వస్తుందనే వీరు కుట్రకు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ముందు రోజు జూన్ 16న సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చారని.. హకీంపేట సోల్జర్స్ వాట్సాప్ గ్రూపులో ఆర్మీ అభ్యర్ధులతో వేర్వేరుగా దిగిన ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు సాయి డిఫెన్స్ సహా, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో పలు అకాడమీలు 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాయి. ఆర్మీకి ఎంపికైన ఒకొక్కరి నుంచి 2లక్షలు వసూలు చేస్తాయి. వీరిలో సగం మంది ఎంపికైనా తమకు 20కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు. అయితే.. ‘అగ్నిపథ్’ రాకతో తమకు నష్టం వస్తుందని భావించి ఈ కుట్రకు సహకరించారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కరోనా కారణంగా 15నెలలుగా పరీక్షలు జరగలేదు. ‘అగ్నిపథ్’తో పరీక్షలు రద్దయ్యాయి. ఆవుల సుబ్బారావు పాత్రపై ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.
741031 970621Thanks for the post, was an fascinating read. Curious as to how you came about that solution 829553
456540 341105Giving you the best News is extremely much imptortant to us. 871038
52664 110799Awesome write-up , Im going to spend more time researching this subject 875188