అంతా అనుకున్నట్టే దీపిక కన్ఫర్మ్ అయిపోయింది. అల్లు అర్జున్-అట్లీ మూవీలో దీపికను తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచి ఈ మూవీ చాలా హైప్ పెంచేస్తోంది. మూవీ అనౌన్స్ మెంట్ నుంచి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక తాజాగా దీపిక అనౌన్స్ మెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.
విజయం దిశగా వెళ్తున్న మహారాణి.. దీపిక పదుకొణెకు స్వాగతం అంటూ మేకింగ్ వీడియో వదిలారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో దీపికా ముఖం చూపించకుండా డైరెక్టర్ అట్లీ స్టోరీ వినిపిస్తున్నట్టు విజువల్స్ ఉన్నాయి. ఆ స్టోరీ విని చాలా ఎగ్జైట్ అయినట్టు దీపిక ముఖాన్ని చూపించారు. ఇందులో దీపిక ఒప్పుకుని సైన్ చేస్తున్నట్టు కనిపించింది. అంతే కాకుండా గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు వీఎఫ్ ఎక్స్ లో చూపించారు. ఇదంతా కేవలం మేకింగ్ వీడియో లాగా ఉంది. ఎలాంటి మూవీ పోస్టర్ విడుదల చేయలేదు.
