Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 02-02-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల చవితి మ. 12.27 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె 4.18 వరకు, తదుపరి రేవతి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనుల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ విజయవంతమవుతారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది . ఇంటా బయటా పై చేయి సాధిస్తారు.

వృషభ రాశి: భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు.

మిథున రాశి: మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. అవి తీవ్ర స్థాయికి చేరకుండా జాగ్రత్త పడండి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, పనులు వాయిదా వేయడం మంచిది.

కర్కాటక రాశి: మిశ్రమ కాలం. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో అప్పులను తీర్చగలుగుతారు. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

కన్య రాశి: బంధుమిత్రులను కలుసుకొని భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యవహారంలో అధికారుల తోడ్పాటు లభిస్తుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

తులారాశి: ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అందుకు తగిన ఆదాయం అందుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది.

వృశ్చిక రాశి,: మిశ్రమ కాలం. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.

ధనస్సు రాశి: గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్దలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మకర రాశి: ఉద్యోగంలో మార్పు కోరుకునే ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

కుంభరాశి: మిశ్రమకాలం. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కోవాలి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఏకపక్ష నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

మీన రాశి: ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆహార నియమాలు పాటించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్...

నిహారిక పింక్ ఎలిఫెంట్ నుంచి మరో సినిమా..!

మెగా డాటర్ నిహారిక సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అంతకుముందు యూట్యూబ్ లో ఎన్నో సీరీస్ లు చేసి ప్రేక్షకులను అలరించగా ఆమె తొలి సినిమాగా చేసిన కమిటీ...