Switch to English

మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షా కు వివరించిన లోకేష్–అనిత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,200FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మొంథా తుపాను భారీ నష్టాన్ని మిగిల్చిందని మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదికతో వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తుపాను ప్రభావం, నష్టాల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా వెల్లడించారు. మొంథా తుపాను అక్టోబర్ 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటిన సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో వీచిన గాలులు, కురిసిన వర్షాలతో మొత్తం 3,109 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తక్షణ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం వెంటనే 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించి అవసరమైన ఆహారం, నీరు, పాలు, ఇతర అవసరమైన వస్తువులు సరఫరా చేసింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి రూ.3,000 తక్షణ సహాయంగా అందించింది. చెట్లు తొలగించడం, తాత్కాలిక వసతులు కల్పించడం, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి చర్యలు వేగంగా చేపట్టినట్లు మంత్రులు తెలిపారు.

మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు–మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు–నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.60 కోట్లు తక్షణ సహాయంగా విడుదల చేసింది.

NDRF మార్గదర్శకాల ప్రకారం ఈ మొత్తం నష్టంలో రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, పునరుద్ధరణ కోసం అర్హమైనవని మంత్రి లోకేష్ వివరించారు. గత నెల 12న సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రమంత్రుల బృందం (IMCT) ఈ ప్రాంతాలను పరిశీలించిందని తెలిపారు. అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా పాల్గొన్నారు.

ఈ నివేదికతో కేంద్రం త్వరితగతిన స్పందించి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలిపారు.

సినిమా

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

కృష్ణంరాజు జయంతి సందర్భంగా మధిరలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 20న స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 86వ జయంతిని పురస్కరించుకుని భారీ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు....

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

రాజకీయం

చంద్రబాబు ఫైర్ స్పీచ్: NTR వర్ధంతి సభలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ విజయాలకు క్రెడిట్ దక్కించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం...

ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి.. ఘన నివాళులు, స్మృతుల స్మరణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్‌కు పూలమాలలు...

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళటమే నా లక్ష్యం: బాలకృష్ణ

తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయుడైన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నేడు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. హృదయంలో...

అనంతపురం ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు… ఏం జరుగుతోంది?

అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వ్యవహారం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో టీడీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో...

బండ్ల గణేష్ సంకల్పయాత్ర .. రేపు కాలి నడకన – తిరుపతికి

నిర్మాత బండ్ల గణేష్ తన సంకల్పాన్ని నెరవేర్చుకోనున్నారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసులు ఆధారం లేనివని తేలి, పూర్తిగా క్లియర్ అయిన నేపథ్యంలో ఆయన మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి సంకల్పయాత్ర చేపట్టనున్నారు....

ఎక్కువ చదివినవి

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్...

Daily Horoscope: మేషానికి కొత్త అవకాశాలు, వృషభానికి ఆర్థిక జాగ్రత్తలు

జనవరి 17, 2026 శనివారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీలో ఉత్సాహం పెరుగుతుంది. పనుల్లో ముందడుగు వేయడానికి అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో చర్చలు ఫలప్రదంగా...

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా, ఆయా హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు...

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవిని చూస్తే.. సోమవారం అయినా కలెక్షన్ల...