కూకట్పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పవన్ నాయుడు, బండారు ప్రసన్న అంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గాయత్రి నగర్ డివిజన్లో ప్రతి ఇంటికి చేరుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీపై విశ్వాసం పెంపొందించాలన్నారు. జనసైనికులు క్రమశిక్షణతో, బాధ్యతతో పనిచేస్తే కూకట్పల్లి ప్రాంతంలో జనసేన పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో మండలి దయాకర్, కొల్లా శంకర్, వేముల మహేష్, ప్రభు చైతన్య, రణదీప్, జాలరవి, రామారావు, వీరబాబు, లక్ష్మి, ప్రమీల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గాయత్రి నగర్ డివిజన్లో ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. స్థానిక స్థాయిలో సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ప్రేమ కుమార్ టీం కృషి చేస్తోంది.
