ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన కరెన్సీ నోట్లనూ వదిలిపెట్టలేదు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెప్పడంతో కొత్త గుబులు బయలుదేరింది. కరోనా అనే కాకుండా ఎలాంటి వైరస్ వ్యాప్తికైనా మన కరెన్సీ అత్యంత మెరుగైన వాహకాలుగా ఉన్నాయని ఆర్బీఐ స్పష్టంచేసింది.
కాగితపు కరెన్సీ ఎంతమాత్రం సురక్షితం కాదని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగితపు నోట్ల ద్వారా కరోనా సహా ఎలాంటి వైరస్ అయినా సులువుగా ఒకచోటు నుంచి మరో చోటుకు వ్యాపిస్తుందని.. దీనిని పాలిమర్ నోట్ల ద్వారా అరికట్టొచ్చని సూచించింది. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను వినియోగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ లో కూడా పాలిమర్ నోట్ల ముద్రణపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ప్రతిపాదించింది. అసలు కరెన్సీ లావాదేవీల కంటే డిజిటల్ లావాదేవీలు మంచిదని, అందరూ ఆ దిశగా వెళ్లాలని పేర్కొంది. అయితే, మనదేశంలో నూటికి నూరు శాతం డిజిటల్ లావాదేవీలు కష్టసాధ్యం కాబట్టి, వైరస్ ను నివారించేందుకు పాలిమర్ నోట్లయితే బెటరని వివరించింది. దీనిపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది.
అయితే, ఇప్పటికిప్పుడు అన్ని నోట్లనూ మార్చి పాలిమర్ నోట్లు ముద్రించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం. అసలే ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న తరుణంలో ఇది మరింత కష్టం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాకపోయినా దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
19857 611189Truly good style and design and outstanding content material , nothing at all else we need to have : D. 883051
93876 479727Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes a lot more than just happening to happen. 57840
317803 228694Utterly composed topic material , thanks for selective details . 863724