Switch to English

పవన్ కళ్యాణ్ ‘తలసీమియా’ సాయంపైనా విమర్శలా.? సిగ్గు సిగ్గు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ విరాళం ఇవ్వొచ్చు కదా.? మ్యూజికల్ ఈవెంట్‌లో ఎంజాయ్ చేసి, విరాళం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారు.! చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీయార్ ట్రస్ట్ ఈవెంట్‌కి హాజరైన పవన్ కళ్యాణ్.!

ఇవీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న విమర్శలు. వైపీపీతో పాటు, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని ఓ వర్గం కూడా, పవన్ కళ్యాణ్ మీద ఇవే విమర్శల్ని చేస్తూ సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తోంది.

అసలు, జరిగిన మ్యూజికల్ ఈవెంట్ దేనికోసం.? పవన్ కళ్యాణ్ ఎందుకు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ఆ వేదికపై నుంచి ప్రకటించారు.? ఇవేవీ తెలుసుకునేంత తీరిక, ఓపిక.. ఆయన్ని ట్రోల్ చేస్తున్నవారికి లేవు. వుంటే, ట్రోల్ చేసే పరిస్థితే వుండదు.

తలసీమియా బాధితులకు సాయం చేసే క్రమంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది.. సినీ సంగీత దర్శకుడు తమ్ నేతృత్వంలో. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ టిక్కెట్ కొనుక్కుని వెళితే, తద్వారా వచ్చే సొమ్ముని తలసీమియా బాధితుల సహాయార్థం ఉపయోగపడుతుందన్నది ఎన్టీయార్ ట్రస్ట్ ఉద్దేశ్యం. రాజకీయాల్ని పక్కన పెట్టి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి.

అంతేగానీ, తలసీమియా బాధితుల సహాయార్థం నిర్వహించిన కార్యక్రమంపై అవాకులు చెవాకులు పేలడం. ఆ కార్యక్రమంలో తలసీమియా బాధితులకు 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తే, దాని మీద వెటకారాలు చేయడమంటే.. అంతకన్నా రాక్షసత్వం ఇంకోటి వుండదు.

తలసీమియా అంటే, ఆషామాషీ అనారోగ్య సమస్య కాదు. నిత్యం వేలాది మంది, లక్షలాది మంది తలసీమియా బాధితులు తెలుగు రాష్ట్రాల్లో విలవిల్లాడుతున్నారు. వాళ్ళకి సకాలంలో రక్తం అందాలి. అందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం, శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి వుంది తలసీమియా బాధితుల్ని ఆదుకునేందుకు.

సామాజిక బాధ్యతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తలసీమియా బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జరిగిన కార్యక్రమాన్ని కేవలం మ్యూజికల్ ఈవెంట్‌గా చూస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? నిజానికి, అదొక దైవ కార్యంగా భావించాల్సి వుంటుంది.

తలసీమియా బాధితులతో ఒక్కసారైనా మాట్లాడితే, జరిగిన ఈవెంట్ ఎలాంటిదో ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఎంత గొప్పదో తలసీమియా ా బాధితులకు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అర్థమవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ మానవ జాతికే వైసీపీ అత్యంత హానికరం.. అన్న విషయం, ఇదిగో ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యింది. వైసీపీ ఏనాడూ ఈ తరహా సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది లేదు. అందుకే, సాయం చేసేవాళ్ళని చూస్తే వైసీపీకి కడుపు మంట.!

కేవలం మ్యూజికల్ ఈవెంటే అయితే, పవన్ కళ్యాణ్ అసలు ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారే కాదు. 50 లక్షల రూపాయల కష్టార్జితం, తలసీమియా బాధితుల సహాయార్థం ఎంతగానో ఉపయోగపడుతుందనే కోణంలో ఓ గొప్ప వేదికగా భావించి, ఎన్టీయార్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కీ.. సాయం అందుకునే తలసీమియా బాధితులకీ.. ా సాయాన్ని అర్థం చేసుకున్నవాళ్ళకి మాత్రమే.. ఆ విలువ ఏంటో తెలుస్తుంది.!

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

నారా లోకేష్: ప్రజాప్రతినిధులతో సకుటుంబ సమావేశం.. ఉండవల్లిలో ఆత్మీయ కలయిక కనులవిందు

గుంటూరు, విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చిన ఆత్మీయ సమావేశం శనివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసంలో ఆహ్లాదకరంగా జరిగింది. ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా హాజరుకావడంతో...

అసెంబ్లీకి రాకుండా డ్రామాలేనా? వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ అనేది ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కాదు, డ్రామాలు చేసే పెద్ద కంపెనీలా మారిందని జనసేన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

ఇండాపూర్ డెయిరీ వ్యవహారంపై హెరిటేజ్ స్పష్టీకరణ

ఇండాపూర్ డెయిరీ – హెరిటేజ్ ఫుడ్స్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై హెరిటేజ్ ఫుడ్స్ అధికారికంగా స్పందించింది. ఇండాపూర్ డెయిరీ తమ సంస్థకు చెందిన యూనిట్ కాదని, అది మహారాష్ట్రలో...

నందిపాటి వంశీ: ‘హే భగవాన్’ నవ్విస్తుంది.. హృదయాన్ని తాకుతుంది

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాస్–నందిపాటి వంశీ జంట మరో వినోదాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్,...