Switch to English

పవన్ కళ్యాణ్ ‘తలసీమియా’ సాయంపైనా విమర్శలా.? సిగ్గు సిగ్గు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ విరాళం ఇవ్వొచ్చు కదా.? మ్యూజికల్ ఈవెంట్‌లో ఎంజాయ్ చేసి, విరాళం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారు.! చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీయార్ ట్రస్ట్ ఈవెంట్‌కి హాజరైన పవన్ కళ్యాణ్.!

ఇవీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న విమర్శలు. వైపీపీతో పాటు, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని ఓ వర్గం కూడా, పవన్ కళ్యాణ్ మీద ఇవే విమర్శల్ని చేస్తూ సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తోంది.

అసలు, జరిగిన మ్యూజికల్ ఈవెంట్ దేనికోసం.? పవన్ కళ్యాణ్ ఎందుకు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ఆ వేదికపై నుంచి ప్రకటించారు.? ఇవేవీ తెలుసుకునేంత తీరిక, ఓపిక.. ఆయన్ని ట్రోల్ చేస్తున్నవారికి లేవు. వుంటే, ట్రోల్ చేసే పరిస్థితే వుండదు.

తలసీమియా బాధితులకు సాయం చేసే క్రమంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది.. సినీ సంగీత దర్శకుడు తమ్ నేతృత్వంలో. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ టిక్కెట్ కొనుక్కుని వెళితే, తద్వారా వచ్చే సొమ్ముని తలసీమియా బాధితుల సహాయార్థం ఉపయోగపడుతుందన్నది ఎన్టీయార్ ట్రస్ట్ ఉద్దేశ్యం. రాజకీయాల్ని పక్కన పెట్టి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి.

అంతేగానీ, తలసీమియా బాధితుల సహాయార్థం నిర్వహించిన కార్యక్రమంపై అవాకులు చెవాకులు పేలడం. ఆ కార్యక్రమంలో తలసీమియా బాధితులకు 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తే, దాని మీద వెటకారాలు చేయడమంటే.. అంతకన్నా రాక్షసత్వం ఇంకోటి వుండదు.

తలసీమియా అంటే, ఆషామాషీ అనారోగ్య సమస్య కాదు. నిత్యం వేలాది మంది, లక్షలాది మంది తలసీమియా బాధితులు తెలుగు రాష్ట్రాల్లో విలవిల్లాడుతున్నారు. వాళ్ళకి సకాలంలో రక్తం అందాలి. అందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం, శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి వుంది తలసీమియా బాధితుల్ని ఆదుకునేందుకు.

సామాజిక బాధ్యతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తలసీమియా బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జరిగిన కార్యక్రమాన్ని కేవలం మ్యూజికల్ ఈవెంట్‌గా చూస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? నిజానికి, అదొక దైవ కార్యంగా భావించాల్సి వుంటుంది.

తలసీమియా బాధితులతో ఒక్కసారైనా మాట్లాడితే, జరిగిన ఈవెంట్ ఎలాంటిదో ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఎంత గొప్పదో తలసీమియా ా బాధితులకు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అర్థమవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ మానవ జాతికే వైసీపీ అత్యంత హానికరం.. అన్న విషయం, ఇదిగో ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యింది. వైసీపీ ఏనాడూ ఈ తరహా సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది లేదు. అందుకే, సాయం చేసేవాళ్ళని చూస్తే వైసీపీకి కడుపు మంట.!

కేవలం మ్యూజికల్ ఈవెంటే అయితే, పవన్ కళ్యాణ్ అసలు ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారే కాదు. 50 లక్షల రూపాయల కష్టార్జితం, తలసీమియా బాధితుల సహాయార్థం ఎంతగానో ఉపయోగపడుతుందనే కోణంలో ఓ గొప్ప వేదికగా భావించి, ఎన్టీయార్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కీ.. సాయం అందుకునే తలసీమియా బాధితులకీ.. ా సాయాన్ని అర్థం చేసుకున్నవాళ్ళకి మాత్రమే.. ఆ విలువ ఏంటో తెలుస్తుంది.!

సినిమా

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

రాజకీయం

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 మార్చి 2025

పంచాంగం తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 మార్చి 2025

పంచాంగం తేదీ 17-03-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ తదియ సా. 4.57 వరకు,...

బెట్టింగ్ యాప్స్.! ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకే కోట్లు చెల్లించారా.?

బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దయెత్తున సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ.....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...