లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ పడుతున్న అవస్థలను అనుకూలంగా మార్చుకోవాలని భావించాడు. తన వద్ద పని చేస్తున్న ఆ కూలీ భార్యపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
రెండు కేజీల బియ్యం ఇస్తానని నమ్మబలికి ఇంటికి రప్పించుకుని అత్యాచారం చేయబోయాడు. బిత్తరపోయిన కూలీ భార్య తప్పించుకుని వచ్చి విషయం భర్తకు చెప్పింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి జిల్లా ఈ స్ట్ పుల్వారి పీఎస్ పరిధిలో జరిగింది. స్థానిక ధనట్ల గ్రామానికి చెందిన ముజిబుర్ రెహ్మాన్ ఓ మార్బుల్ కాంట్రాక్టర్. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కూలీ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమెను లొంగదీసుకోవాలని భావించాడు.
ఇంటికి పిలిచి గతంలో తనను చాటుగా తీసిన ఓ న్యూడ్ వీడియోను చూపించి తన కోరిక తీర్చాలని బలవంత పెట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన కోరిక తీర్చకపోతే తన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడని కూడా తెలిపింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.
5679 453173Identified this on MSN and Im pleased I did. Well written article. 276077
791642 331605I extremely delighted to find this web internet site on bing, just what I was looking for : D besides saved to bookmarks . 968508