ఇంటికి ఆరు బయట నిద్రపోయిన ఓ వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించాడు. మిస్టరీగా మారిన ఈ హత్యోదంతంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణ శివారులోని భగత్ సింగ్ నగర్ లో పాలకొల్లు నాగేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. నగేశ్ అని పిలిచే ఈవ్యక్తికి లక్ష్మీదేవితో కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. వీరికి 15ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన నాగేశ్ కు ఇంట్లో భార్య, కూతురును వేధించడంతో నిత్యం కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. రోజులా తాగి వచ్చిన నాగేశ్ భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఇంటికి ఆరు బయట మంచం వేసి బుధవారం రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నగేశ్ ను మంచం కోళ్ల సాయంతో తలపై కొట్టి హత్య చేశారు.
తీవ్ర రక్త స్రావం కావడంతో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద హత్య కింద కేసు నమోదు చేశారు. నాగేంద్రను బంధువులే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ సూర్యనారాయణ కేసులో వివరాలు సేకరించారు. హత్యలో మరెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోనం రిమ్స్ కు తరలించారు.
466283 723306An attention-grabbing dialogue is worth comment. I think that its greatest to write extra on this subject, it wont be a taboo subject even so generally individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 910621
227627 694921What a lovely blog. Ill surely be back again. Please preserve writing! 252391
580008 435636Thanks for helping out, excellent data. 599272